ఆ నదిలో మహిళలు స్నానం చేయకూడదు
శబరిమల :శబరిమల సందర్భనకు వచ్చే మహిళా భక్తులు పంపానదిలో స్నానం చేయకూడదని ట్రావెల్ కోర్ దేవస్థానం బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ట్రావెన్ కోర్ దేవాలయ అధ్యక్షుడు గోపాలకృష్ణన్ చెప్పారు.
శబరిమల సందర్శనకు వచ్చే మహిళా భక్తులు పంపానదిలో స్నానం చేయకూడదని దేవాలయబోర్డు నిర్ణయం తీసుకొంది. భక్తుల నుండి వచ్చిన పిర్యాదుల ఆధారంగా ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నట్టు దేవాలయ కమిటీ ప్రకటించింది.
శబరి మల దేవాలయంలోకి మహిళల ప్రవేశం ఉండేది కాదు, ఇటీవలే సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ దేవాలయంలోకి మహిళలు కూడ ప్రవేశం కల్పించారు. దేవాలయానికి వచ్చే భక్తులు నియమాలను పాటించాలని దేవాలయ కమిటీ కోరింది.
మందాల మకర విలక్కు పండుగ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.భక్తుల నుండి వచ్చిన ఫిర్యాదుల కారణంగా నిర్ణయం తీసుకొన్నారు.మరో వైపు శబరిమల ఉత్సవం సందర్భంగా వార్తలు కవరేజీ అందించిన మీడియా ప్రతినిధులకు అవార్డులను అందించారు.