వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విచారణ తర్వాతే అరెస్ట్: వరకట్న వేధింపుల కేసుల్లో సుప్రీం సంచలన తీర్పు

వరకట్న వేధింపులకు సంబంధించి ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేయటం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అరెస్టులకు ముందు ఆ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణను జరపాలని.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వరకట్న వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

వరకట్న వేధింపులకు సంబంధించి ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు నిందితులను అరెస్టు చేయటం సరికాదని సుప్రీంకోర్టు పేర్కొంది. అరెస్టులకు ముందు ఆ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణను జరపాలని, ఆ తర్వాతే చర్యకు ఉపక్రమించాలని స్పష్టం చేసింది.

భర్త, అతని తరఫు బంధువుల వేధింపుల నుంచి భార్యకు రక్షణ కల్పించేందుకు తీసుకొచ్చిన చట్టం దుర్వినియోగం అవుతున్నందున ప్రతి జిల్లాలోనూ కుటుంబ సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

Dowry law: First examine complaint then arrest SC says in landmark verdict

వేధింపులపై ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ కమిటీలు పరిశీలించి నివేదిక సమర్పించిన తర్వాతే చర్యలు ఉండాలని స్పష్టం చేసింది. ఆ కమిటీల విధివిధానాలనూ న్యాయస్థానం నిర్దేశించింది.

రాజేశ్‌ శర్మ అనే వ్యక్తి అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఏకే గోయెల్‌, యుయు లలిత్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఈ తీర్పునిచ్చింది. వరకట్న హింస నిరోధక చట్టం దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఆ చట్టానికి తగిన సవరణలు చేయాలని కేంద్ర న్యాయశాఖను కోరింది.

English summary
Bringing some amount of sanity to the dowry harassment law, the Supreme Court said that an arrest in such case should be made only after examining the complaint.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X