వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యంత కౄరంగా.. బాలుడి తల నరికి.. ఆపై అవయవాలు తినేశాడు..

ఆడుకుంటున్న మోనిస్ ను నజీమ్ సమీపంలోని బంధువు ఇంటికి బలవంతంగా లాక్కుపోయాడు.ఆపై అతని తల నరికివేసి రక్తపు మడుగులో ఉన్న అతని శరీరం నుంచి కొన్ని అవయవాలను తినడం మొదలుపెట్టాడు.

|
Google Oneindia TeluguNews

లక్నో: మత్తు పదార్థాలకు బానిసైన ఓ యువకుడు విచక్షణ కోల్పోయాడు. అసలేం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఒక బాలుడిని హత్య చేయడమే గాక.. ఆపై అత్యంత జుగుప్స కలిగించేలా అతని శరీర భాగాలను భుజించాడు. సంఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు సైతం సదరు నిందితుడి తీరుకు నివ్వెరపోయారు.

ఉత్తరప్రదేశ్ లోని పిలిభిత్ జిల్లా అమారియాలో మంగళవారం నాడు ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మహమ్మద్ మోనిస్ అనే బాలుడు ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్న నజీమ్ అనే యువకుడు అటువైపుగా వచ్చాడు.

Drug addict beheads 7-year-old boy, eats his flesh in UP’s Pilibhit

ఆడుకుంటున్న మోనిస్ ను నజీమ్ సమీపంలోని బంధువు ఇంటికి బలవంతంగా లాక్కుపోయాడు.ఆపై అతని తల నరికివేసి రక్తపు మడుగులో ఉన్న అతని శరీరం నుంచి కొన్ని అవయవాలను తినడం మొదలుపెట్టాడు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకునేసరికి హత్యకు గురైన బాలుడి శరీరంలో కొన్ని అవయవాలు లేకుండా పోవడం పోలీసులు గుర్తించారు. ఆపై ఆరా తీయగా అసలు విషయాన్ని నిందితుడు అంగీకరించాడు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా.. స్థానికులు అతనిపై దాడికి యత్నించారు.

మోనిస్ తండ్రి ఫిర్యాదు మేరకు నజీమ్ పై ఐపీసీ సెక్షన్-302(హత్య), 362(కిడ్నాప్), 341సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితున్ని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

English summary
Drug addict beheads 7-year-old boy, eats his flesh in UP’s Pilibhit
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X