కుక్క చావు అంటే ఇదే: పీలదాక తాగేసి, మర్మాంగం తినేసిన కుక్కలు !
కర్ణాటకలోని బెళగావి జిల్లా బైలహోంగళ పట్టణంలో పీకలదాక మద్యం సేవించిన ఇమామ్ సాబ్ (30) అనే యువకుడిపై 15 వీది కుక్కలు దాడిచేసి అతని మర్మాంగం, ముఖం, చాతి కొరుక్కుతిని అతి దారుణంగా చంపేశాయి.
బెంగళూరు: పీకలదాక మద్యం సేవించిన యువకుడు అపస్మారక స్థితిలో పడిపోవడంతో వీది కుక్కలు అతిదారుణంగా పీక్కుతిని చంపేసి ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లా బైలహోంగళ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
భైలహోంగళలో నివాసం ఉంటున్న హసన్ సాబ్ ఇమామ్ సాబ్ కిత్తూరు (30) అనే యువకుడు వీది కుక్కల దాడిలో మరణించాడు. ఇమామ్ సాబ్ శుక్రవారం రాత్రి పీకలదాక మద్యం సేవించి నడుచుకుంటు ఇంటికి బయలుదేరాడు.
అయితే అతను ఇంటికి వెళ్లడానికి సాధ్యం కాకపోవడంతో బైలహోంగల పట్ణంలోని బస్ట్ స్టాండ్ దగ్గర ఫుట్ పాత్ మీద కుప్పకూలిపోయాడు. మద్యం మత్తు ఎక్కువ కావడంతో అపాస్మరక స్థితిలోకి వెళ్లిపోయాడు. అదే సమయంలో 15 వీది కుక్కలు ఇమామ్ సాబ్ మీద దాడి చేశాయి.
అతని ముఖం, చాతి, మర్మాంగం పీక్కుతిన్నాయి. అటు వైపు గస్తీ వెళ్లిన పోలీసులు విషయం గుర్తించి వీది కుక్కలను తరిమికొట్టి అతన్ని బైలహోంగళ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై అతను మరణించాడని శనివారం పోలీసులు తెలిపారు.