బట్టలిప్పుకుని చిందులేసిన పోలీసులు: 8మందిపై వేటు
వివేక్ చవాన్, సూరజ్ తోమార్, సౌరభ్ కుమార్, సందీప్ కుమార్, దీన్దయాల్ సింగ్, హితేష్ చౌదురి, సచిన్ మాలిక్, హేమంత్ భాటి అనే కానిస్టేబుళ్లను గురువారం సస్పెండ్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
క్రమశిక్షణా రహితంగా సంభల్లోని ఓ హోటల్లో నవంబర్ 15వ తేదీన చొక్కాలు విప్పి చిందులువేశారంటూ ఎస్పీకి ఫిర్యాదు అందింది. ఈ మేరకు విచారణ జరిపిన అనంతరం చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
మామను చంపిన అల్లుడు: అరెస్ట్
ఘజియాబాద్: ఆస్తి కోసం స్నేహితుడితో కలిసి సొంత మామను కాల్చి చంపిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తన మామ షకీల్ అలీ, స్నేహితుడు అనీస్ లతో కలిసి షాపింగ్ ముగించుకొని ఘజియాబాద్ నుంచి వస్తుండగా నలుగురు వ్యక్తులు రెండు బైకులపై వచ్చి కాల్పులు జరిపారని షకీల్ అల్లుడు కమీల్ నవంబర్ 15న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన షకీల్ అలీని ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మరణించాడని పోలీసులకు తెలిపాడు. అతని ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులకు పలు అనుమానాలు వచ్చాయి.
స్నేహితులు ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాకపోవడం, సంఘటనా స్థలంలో బైక్ టైరు గుర్తులు లేకపోవడంతో తమదైన శైలిలో విచారణ చేపట్టి నిజం రాబట్టారు. ఆస్తి కోసం ఈ హత్యకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని అదనపు డిప్యూటీ కమిషనర్ రాజేంద్రసింగ్ సాదర్ చెప్పారు.