వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

19ఏళ్ల తర్వాత: ఫేస్‌బుక్ కలిపింది తండ్రీకొడుకుల్ని

|
Google Oneindia TeluguNews

లక్నో: అచ్చం సినిమాల్లోలానే ఇక్కడ చోటు చేసుకుంది. ఓ తండ్రి కొడుకులు 19ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. అది కూడా సోషల్ మీడియా ఫేస్‌బుక్ సహాయంతో కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. 19ఏళ్ల క్రితం దూరమైన ఇద్దరు తండ్రి కొడుకులు ఫేస్‌బుక్‌ ద్వారా మళ్లీ కలుసుకున్నారు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గోరఖ్‌పూర్‌ గ్రామానికి చెందిన అక్తర్‌ అలామ్‌ అనే వ్యక్తి 1996 నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో గత 19 సంవత్సరాలుగా అతని కుమారుడు బబ్లూ అతని కోసం వెతుకుతూనే ఉన్నాడు.

facebook helps son to find his father after 19 years

అయితే ఇటీవల ఒక ఎన్జీవో( స్వచ్ఛంద సంస్థ) సంస్థ 70ఏళ్ల అక్తర్‌ ఫోటోని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. అది చూసిన బబ్లూ ఫేస్‌బుక్‌ సహాయంతో ఆ స్వచ్ఛంద సంస్థ వారి వివరాలు సేకరించి తద్వారా తన తండ్రిని కలుసుకోగలిగాడు.

తన తండ్రి చాలా కాలం తర్వాత కలవడం పట్ల ఆ కొడుకు సంతోషం వ్యక్తం చేశాడు. స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలిపాడు.

English summary
Facebook helped son to find his father after 19 years in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X