వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిఎస్టీ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం, వాకౌట్ చేసిన టీఎంసీ

జిఎస్టీ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. బుదవారం సాయంత్రానికి లోక్ సభ ఆమోదం తెలిపింది. లోక్ సభ కంటే ముందే రాజ్యసభలో కూడ ఈ బిల్లు ఆమోదం తెలిపింది. దీంతో జూలై నుండి కేంద్రం జిఎస్టీ నుండి అమలు చేయనున్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జిఎస్టీ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. బుదవారం సాయంత్రానికి లోక్ సభ ఆమోదం తెలిపింది. లోక్ సభ కంటే ముందే రాజ్యసభలో కూడ ఈ బిల్లు ఆమోదం తెలిపింది. దీంతో జూలై నుండి కేంద్రం జిఎస్టీ నుండి అమలు చేసే అవకాశం ఉంది.

అయితే జిఎస్టీ బిల్లు కీలకమైన ఆర్థిక బిల్లుకు రాజ్యసభ బుదవారం నాడు ఆమోదం తెలిపింది. సవరణలతో కూడిన ఆర్థిక బిల్లుకు సభ ఆమోదించింది.

ఈ బిల్లును బుదవారం నాడు ఉదయం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై కాంగ్రెస్, సిపిఎం పార్టీలు సవరణలు ప్రతిపాదించాయి.

ఈ సవరణలపై కాంగ్రెస్ పార్టీ నేత దిగ్విజయ్ సింగ్, సిపిఎం నేత సీతారాం ఏచూరి ఓటింగ్ ను కోరారు. అనంతరం ఆర్థిక బిల్లుపై చర్చ జరుగుతుండగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు.

arun jaitley

దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం కోసం జీఎస్టీ బిల్లును రూపొందించారు. ఈ బిల్లును ఈ ఏడాది జూలై 1వ, తేది నుండి అమల్లోకి తేవాలని కేంద్రం భావిస్తోంది.
అయితే ఈ బిల్లుకు రెండు సభలు ఆమోదం తెలిపితే కొన్ని రాష్ట్రాలు తమకు జరిగే నష్టాన్నికేంద్రం భరించాలని కోరుతున్నాయి.

English summary
Lok Sabha is debating GST bills. Union Finance Minister Arun Jaitley has led the Narendra Modi government in the lower House of Parliament. Jaitley had said that the government wants to pass these landmark tax reforms through consensus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X