కలెక్టర్ తుపాకి గురి పెట్టిన మాజీ మంత్రి
చెన్నై: రైతుల సమస్యల పరిష్కార సమావేశంలో ఓ మాజీ మంత్రి హంగామా చేశారు. వేదిక మీద ఉన్న జిల్లా కలెక్టర్ కు తుపాకి గురి పెట్టి డీఎంకే హై కమాండ్ అగ్రహానికి గురై పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు.
తమిళనాడులోని ధర్మపురి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతుల సమస్యల పరిష్కార సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కలెక్టర్ వివేకానందన్ అధ్యక్షత వహించారు. సుమారు 500 మంది రైతులు పాల్గోన్నారు.
ఇదే సమావేశానికి తమిళనాడు మాజీ మంత్రి ములైవేందన్ హాజరైనారు. ఉచిత విద్యుత్, ప్రభుత్వ రాయితీలు అందడం లేదని, చెరువుల సమస్యలపై రైతులు మాట్లాడుతున్నారు. అధికారులు వారి సమస్యలు పరిష్కరిస్తామని చెబుతున్నారు.
అదే సందర్బంలో మాజీ మంత్రి ములైవేందన్ మాట్లాడుతూ మద్యలో బ్యాగ్ లో నుంచి రివాల్వర్ బయటకు తీసి కలెక్టర్ వివేకానందన్ కు గురి పెట్టారు. కలెక్టర్ తో పాటు అక్కడ ఉన్న అధికారులు, రైతులు షాక్ కు గురైనారు.
మాజీ మంత్రి ములైవేందన్ మాట్లాడుతూ తన రివాల్వర్ లైసెన్స్ రెన్యువల్ చెయ్యాలని అర్జీ పెట్టుకున్నా ఇంత వరకు స్పందించలేనని అన్నారు. వెంటనే స్పందించిన కలెక్టర్ వివేకానందన్ మీరు మొదట రివాల్వర్ లోపల పెట్టాలని, సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.
మాజీ మంత్రి ములైవేందన్ డీఎంకే పార్టీ నాయకుడు. ఆయన తీరు పార్టీకి చెడ్డపేరు వస్తుందని ఆలోచించిన డీఎంకే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. తరువాత ములైవేందన్ డీఎండీకేలో చేరారు.