వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
షాక్: ఎస్ బి ఐ ఐ క్యాష్ వాహనం నుండి కోటిన్నర దోపిడి
ఎస్ బి ఐ క్యాష్ తరలించే వాహనంలో నగదును నింపుతుండగా నలుగురు వ్యక్తులు కోటిన్నర రూపాయాలను దోచుకొన్నారు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.
ముంబై: ఎటిఎంలలో నగదును డిపాజిట్ చేసే వాహనం నుండి కోటిన్నర నగదును దోపిడి చేశారు దుండగులు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.నలుగురు గుర్తుతెలియని దుండగులు ఈ దోపిడికి పాల్పడ్డారు.
గుర్తు తెలియని నలుగురు దుండగులు పథకం ప్రకారంగా ఈ దోపిడికి పాల్పడ్డారు.అయితే ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించి దోపిడికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.
ఆసియాలోనే అతిపెద్ద స్లమ్ ఏరియా ముంబైలోని ధారవి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఎస్ బి ఐ కు చెందిన నగదును వ్యాన్ లోకి తీసుకెళ్తుండగా నలుగురు దుండగులు దోపిడికి పాల్పడ్డారు.
అయితే ఈ ఘటనపై ఎస్ బి ఐ సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు.ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
English summary
In yet another incident of loot, a whopping amount of Rs 1.5 crore cash was looted in Mumbai on Thursday.
Story first published: Thursday, March 16, 2017, 18:53 [IST]