వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిమజ్జన వివాదం: వారణాసిలో రెచ్చిపోయిన సాధువులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో సాధువులు రెచ్చిపోయారు. గంగానదిలో గణేష్ నిమజ్జనాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం సాధువులు తలపెట్టి ప్రదర్శన హింసాత్మకంగా మారింది. పోలీసుల లాఠీఛార్జికి వ్యతిరేకంగా వారణాసిలో షాపులు, వాహనాలను ఆందోళనకారులు తగలబెట్టారు.

 Violence in Varanasi after cops

గంగానదిలో కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో గణేశ్ ప్రతిమలను నదిలో నిమజ్జనం చేయడంపై అలహాబాద్‌ హైకోర్టు నిషేధం విధించింది. అయితే కోర్టు ఆదేశాలను పట్టించుకోని కొంతమంది స్థానికులు సాధువులతో కలిసి వినాయక నిమజ్జనానికి గంగానదికి బయలుదేరారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

 Violence in Varanasi after cops

గంగానదిలో నిమజ్జనం కుదరదన్న పోలీసుల హెచ్చరికలను సాధువులు లేక్కచేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో పోలీసులు సాధువులపై లాఠీ చార్జీ చేశారు. ఈ లాఠీఛార్జీ సంఘటన సెప్టెంబర్ 22న జరిగింది. ఆరోజు జరిగిన ఘర్షణలో సుమారు 30 మందికి గాయాలు అయ్యాయి.

గణేశ్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు జరిపిన లాఠీచార్జీపై వారణాసిలో సాధువులు సోమవారం ఆందోళనకు దిగారు. లాఠీచార్జీ జరిపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ఆందోళన ఈరోజు హింసాత్మకంగా మారింది.

English summary
Hundreds and thousands of sadhus on Monday held a demonstration in Varanasi against the September 22 police baton-charge on a procession where they were heading to immerse Lord Ganesha’s idol in the Ganga. The police action led to widespread violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X