నేపాల్ భూకంపం: ఎయిర్ ఫోర్స్పై సచిన్, ప్రధాని మోడీ ట్వీట్లు
న్యూఢిల్లీ: నేపాల్ భూకంప బాధితులకు సహాయం అందిస్తున్న భారత ఎయిర్ ఫోర్స్ సేవలను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కొనియాడారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సేవలు అమోఘం అన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న పలువురు భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు చేపట్టిన చర్యలు ప్రశంసనీయమని కితాబిచ్చారు.
ఓ వైపు వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దైర్యంతో పని చేస్తున్నాయన్నారు. భూకంప ప్రాంతంలో చిక్కుకు పోయిన 1900 మందిని ఇప్పటి వరకు వారు తసుకు వచ్చారని కొనియాడారు.
Great
relief
work
being
done
by
the
Indian
Air
Force.
Have
brought
back
over
1900
stranded
Indians
by
flying
sorties
braving
the
bad
weather
—
sachin
tendulkar
(@sachin_rt)
April
27,
2015
ఇండియన్ ఆర్మీపై ప్రధాని మోడీ
భూకంపం ధాటికి విలవిల్లాడుతున్న నేపాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఆర్మీకి, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఇతరులకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు సోమవారం నాడు ఆయన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. నేపాల్లో సంభవించిన విపత్తుపై వెంటనే స్పందించి ఆదేశంలో సహాయ చర్యలు చేపట్టినందుకు గాను మోడీపై ప్రశంసలు కురిపిస్తూ దేశ, విదేశాల నుంచి పలువురు ట్వీట్లు చేస్తున్నారు.
We
must
thank
our
armed
forces,
NDRF
teams,
doctors
&
all
those
volunteers
who
are
overcoming
every
obstacle
to
restore
normalcy
in
Nepal.
—
Narendra
Modi
(@narendramodi)
April
27,
2015
ఈ నేపథ్యంలోనే దీనిపై స్పందించిన ప్రధాని మోడీ నేపాల్ను యాథాతథ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్న ఆర్మీ జవాన్లు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, వైద్యులు, వాలెంటర్లీకు నిజమైన అభినందలు తెలపాలని ట్వీట్ చేశారు. ప్రధాని మోడీ మీడియాకు కూడా ధన్యవాదాలు తెలిపారు. మీడియా ధైర్యంగా గ్రౌండ్ నుండి కవరేజ్ ఇస్తోందని కితాబిచ్చారు.