వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జీఎస్టీ డెడ్ లైన్ జూలైకి వాయిదా: అరుణ్ జైట్లీ

కాగా, వార్షిక టర్నోవర్ రూ,1.5కోట్ల వరకు ఉన్న సంస్థల పన్నులపై తమకే పూర్తి హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్న సంగతి తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏప్రిల్1 నుంచి కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకురావాలనుకున్న జీఎస్టీ అమలు తేదీ వాయిదా పడింది. జూలై1,2017కు జీఎస్టీ తేదీ వాయిదా పడింది. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఈ విషయాన్ని ప్రకటించారు.

పన్ను అధికారాలపై కేంద్ర-రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించనందున్న ఈ తేదీని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. జీఎస్టీ అమలు తేదీపై అరుణ్ జైట్లీ అధ్యక్షతన నేడు సమావేశమైన కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. కౌన్సిల్ తర్వాతి సమావేశం ఫిబ్రవరి 18న జరగనుంది.

Gst roll out deferred to july 1 finance minister arun jaitley

కాగా, వార్షిక టర్నోవర్ రూ,1.5కోట్ల వరకు ఉన్న సంస్థల పన్నులపై తమకే పూర్తి హక్కులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం కేంద్రం సానుకూలంగా లేనప్పటికీ.. ఆఖరికి 90శాతం హక్కులు రాష్ట్రాలకు, 10శాతం కేంద్రం పరిధిలో ఉంటాయని జైట్లీ పేర్కొన్నారు.

రూ.1.5కోట్ల కన్నా ఎక్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులపై కేంద్రానికి-రాష్ట్రానికి 50:50హక్కులు కలిగి ఉండనున్నట్టు చెప్పారు. అయితే పశ్చిమబంగా లాంటి రాష్ట్రాలు జీఎస్టీ తమ రెవెన్యూకు గండిపెడుతోందని వాదిస్తున్నాయి. వచ్చే ఐదేళ్లలో కేంద్రం చెల్లించే నష్టపరిహారాలను పెంచాలని ఆ రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.

English summary
Union Finance Minister Arun Jaitley on Monday addressed the media in Delhi, after GST Council meet in New Delhi and said the rollout has been deferred to July 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X