రాజస్థాన్ రగడ: గుజ్జర్ల ఆందోళన, 10 రైళ్లు రద్దు, 57 మళ్లింపు
జైపూర్: ప్రభుత్వ ఉద్యోగాలలో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజస్థాన్ లో గుజ్జర్లు ఆందోళన ముమ్మరం చేస్తున్నారు. గతంలో ఆందోళన చేస్తున్న విధంగానే ఈసారి పలు ప్రాంతాలలోని రైలు మార్గాలను అడ్డుకున్నారు.
రైలు పట్టాల మీద బైఠాయించిన వేలాధి మంది గుజ్జర్లు ధర్నాలు చెయ్యడంతో ప్రభుత్వం పలు రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. ఢిల్లీ-ముంబై మార్గంలో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. భరత్ పూర్ ప్రాంతంలోని పిలుకాపుర వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఈ ప్రాంతంలో ఆరు రైళ్ల మీద ప్రభావం పడింది. ప్రభుత్వ ఉద్యోగాలలో తమకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తేనే ఉద్యమాలు నలిపి వేస్తామని గుజ్జర్ అరక్షణ్ సంఘర్ష్ సమితి అధికార ప్రతినిధి హిమ్మత్ సింగ్ అంటున్నారు. గుజ్జర్ నాయకుడు కిరోరి సింగ్ మే 11వ తేది రిజర్వేషన్ల అంశంపై న్యాయయూత్ర ఆందోళన ప్రారంభించారు.
గత 8 సంవత్సరాల క్రితం జరిగిన పోరాటాలకు కిరోరి సింగ్ నాయకత్వం వహించారు. ప్రస్తుతం మాకు ఒక్క శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, 5 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు పోరాటం చేస్తామని అంటున్నారు. గుజ్జర్లు ఆందోళన వలన రాజస్థాన్ లో 10 రైళ్లు రద్దు చేశారు. 57 రైళ్ల సంచారాన్ని దారి మళ్లించారు.