నడిరోడ్డుపై, అర్ధరాత్రి అమ్మాయిల సిగపట్టు(వీడియో)
న్యూఢిల్లీ: గుర్గావ్లో అర్ధరాత్రి మద్యం సేవించి, మత్తులో రోడ్లపై అమ్మాయిలు సిగపట్టుకు దిగారు. అమ్మాయిల తీరు చూసిన పోలీసులు దిగ్భ్రాంతి చెంది, లాఠీ ఝులిపించి వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు. గుర్గావ్ సారా మాల్ బయట బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.
గుర్గావ్లోని ఎంజీ రోడ్డులో అత్యధికంగా పబ్బులు, బార్లు ఉన్నాయి. అక్కడ నడి రోడ్డుపై మద్యం మత్తులో తూలుతూ ఉన్న ముగ్గురు అమ్మాయిలు గొడవకు దిగారు. అదే సమయంలో జుట్లు పట్టుకుని ఒకరినొకరు కొట్టుకున్నారు. వారి గొడవ ముగిసిన తర్వాత అంతా ఏకమైన ఒకే ఆటోలో ఎక్కి వెళ్లి పోయారు.
ఆ అమ్మాయిలు జుట్లుజుట్లు పట్టుకుని బాహాబాహికి తెగబడిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తుంది. ఇప్పటికే న్యూఢిల్లీ అత్యాచారాల నగరంగా పేరు తెచ్చుకుంది. ఇక, గతంతో పోలిస్తే 2014లో నేరాల సంఖ్య 26 శాతం పెరిగిందని నేర విభాగ శాఖ అధికారులు వెల్లడించారు.