మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు నక్సలైట్లను దెబ్బతీసిందా?: ఇదీ లెక్క
గత ఏడాదిలో ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ... నోట్ల రద్దు వల్ల నక్సలైట్లు బాగా దెబ్బతిన్నారని చెప్పారు.
రాయపూర్: గత ఏడాదిలో ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ... నోట్ల రద్దు వల్ల నక్సలైట్లు బాగా దెబ్బతిన్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన లోకసభలో చెప్పారు.
నోట్ల రద్దు వల్ల నక్సలైట్ల వద్ద డబ్బులు లేకుండా పోయాయని, కాబట్టి వారి ఆపరేషన్కు ఇక డబ్బులు పెద్దగా ఉండవని చెప్పారు.
రాజ్నాథ్ ప్రకటన చేసి మూడు నెలలు దాటింది. అయితే, ఆయన ప్రకటన చేసిన ఈ మూడు నెలల్లోనే ఒక్క చత్తీస్గఢ్లోనే రెండు మేజర్ దాడులు జరిగాయి. ఈ ఘటనలలో 38 మంది జవాన్లను కోల్పోయాం.
దీనిని బట్టి తెలుస్తోందేమంటే.. నోట్ల రద్దు వల్ల నక్సలైట్ల పైన ఎలాంటి ప్రభావం పడలేదని, తద్వారా వారి కార్యకలాపాలకు ఇబ్బంది లేదని తెలుస్తోంది.
అయితే, వాస్తవం ఏమంటే నక్సలైట్ల ప్రభావం ఉన్న గ్రామాల 106 నుంచి 68కి పడిపోయాయి. అయితే నక్సలైట్లకు గట్టి పట్టు ఉన్న ప్రాంతాల్లో మాత్రం వారు పట్టు సడలలేదని తెలుస్తోంది.
ముఖ్యమైన విషయం ఏమంటే నక్సలైట్లకు ఫండ్స్ దేశం వెలుపలి నుంచి వస్తున్నాయి. అలాగే, లూటీ చేయడం ద్వారా కూడా డబ్బులు సేకరిస్తున్నారు. వారికి ఇంటర్ సర్విసెస్ ఇంటెలిజెన్స్ ద్వారా నక్సలైట్లకు ఆయుధాలు దొరుకుతున్నాయని తెలుస్తోంది.