వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య టీచర్: స్కూల్ లో పాఠాలు చెబుతుంటే పెట్రోల్ పోసి నిప్పంటించాడు, చివరికి !

స్కూల్ లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న లేడీ టీచర్ మీద ఆమె భర్త పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా, మాగడి తాలుకాలోని శంభయ్యనపాళ్య ప్రభుత్వ పాఠశాలలో జరిగింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: స్కూల్ లో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న లేడీ టీచర్ మీద ఆమె భర్త పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన కర్ణాటకలోని రామనగర జిల్లా, మాగడి తాలుకాలోని శంభయ్యనపాళ్య ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. దాదాపు 50 శాతం కాలిపోయిన లేడీ టీచర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

రేణకారాధ్య, సునంద (50) దంపతులు. సునంద కర్ణాటక ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నారు. శంభయ్యనపాళ్య ప్రభుత్వ పాఠశాలలో ఎప్పటిలాగే విద్యార్థులకు పాఠశాలు చెప్పడానికి వెళ్లారు. తరగతి గదిలో కుర్చుని సునంద పాఠం చెబుతున్నారు.

Her husband tried to kill his teacher wife in front of students

ఆ సందర్బంలో సునంద భర్త రేణుకారాధ్య క్యాన్ లో పెట్రోల్ తీసుకుని నేరుగా తరగతి గదిలిలోకి వెళ్లాడు. పిల్లలను దూరం వెళ్లాలని చెప్పి భార్య సునంద మీద క్షణాలలో పోట్రోల్ పోసి నిప్పంటించి పరారైనాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు మంటలు అదుపు చేసి సునందను ఆసుపత్రికి తరలించారు. రేణుకారాధ్య పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని, సునంద ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నదని పోలీసులు తెలిపారు.

English summary
Her husband tried to kill his teacher wife in front of students near Ramanagara in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X