దారుణం: ఐసియూలో బాలింత మహిళపై రేప్
ఛండీగఢ్: హర్యానా రాష్ట్రంలో అత్యంత హేయమైన ఘటన చోటుచేసుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ బాలింతపై ఆగంతుకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాలో ఓ పోలీస్ భార్య కాన్పు కోసం ఆస్పత్రిలో చేరింది. బిడ్డకు జన్మనిచ్చి ఐసీయూలో చికిత్స పొందుతోంది.
ఆదివారం తెల్లవారు జామున కారులో వచ్చిన గుర్తు తెలియని దుండగుడు నేరుగా ఐసీయూలోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు సీసీటీవీలో నమోదైందని పోలీసులు వెల్లడించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడ్ని పట్టుకొనేందుకు బహదుర్ఘడ్, సమీప ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఘటన జరిగిందని బాధితురాలి బంధువులు ఆరోపించారు.