వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నడిరోడ్డుపై 11 మంది ఒకేసారి..: ఒళ్లు గగుర్పొడిచేలా (వీడియో)

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై పదకొండు మంది కత్తులతో దాడి చేశారు. పట్టపగలే అతనిని దారుణంగా నరికి చంపారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై పదకొండు మంది కత్తులతో దాడి చేశారు. పట్టపగలే అతనిని దారుణంగా నరికి చంపారు.

ఏకంగా 27సార్లు ఆ వ్యక్తిని కర్కశంగా నరికారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని ధులే ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ వీడియో ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

రఫీకుద్దీన్ అనే వ్యక్తి స్థానికంగా నేరాలు చేస్తుండేవాడు. అతడు ధులే రోడ్డు పక్కన టీ తాగుతుండగా ఒకేసారి పదకొండు మంది కత్తులు, కర్రలు, తుపాకీతో వచ్చి దాడికి పాల్పడ్డారు.

తొలుత కర్రలతో కొట్టి అనంతరం కత్తులతో 27 సార్లు పొడిచారు. ఆ తర్వాత తుపాకీతో అతడిపై కాల్పులు జరిపారు. చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత స్కూటర్లు, బైకులపై పారిపోయారు.

పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. హత్య జరిగే సమయంలో వర్షం కూడా వస్తుండటంతో ఆ ప్రాంతం భీతావాహంగా కనిపించింది. హత్యకు గురైన వ్యక్తిపై 30 క్రిమినల్ కేసులు ఉన్నాయి.

English summary
In extremely disturbing CCTV footage of a murder on Tuesday, a man is hacked to death with swords by a group of 11 men in broad daylight in Maharashtra's Dhule, around 280 km from Mumbai. The men kept striking Rafiquddin, a local criminal, long after he had stopped moving. He was also shot in the head.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X