ఆకాశంలో ‘ఆరో కన్ను’.. అదిరిపోయే నాణ్యతతో చిత్రాలు!
భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన కార్టోశాట్-2 ఉపగ్రహం తన పని ప్రారంభించింది.
న్యూఢిల్లీ: భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన కార్టోశాట్-2 ఉపగ్రహం తన పని ప్రారంభించింది. ఈ ఉపగ్రహాన్ని భారత్కు ఆకాశంలో ఆరో నేత్రంగా అభివర్ణిస్తున్నారు.
ఈ శాటిలైట్ జులై 26న అంతరిక్షం నుంచి భారత్తో పాటు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల ఛాయాచిత్రాలను అద్భుతమైన క్లారిటీతో తీసి పంపింది. వీటిని ఇస్రో ఇవాళ విడుదల చేసింది.
First day Images from Cartosat2 Series Satellite launched on June 23, 2017https://t.co/W1TENBy8yT pic.twitter.com/nMrS8hynEk
— ISRO (@isro) June 28, 2017
ఈ ఛాయాచిత్రాల్లో.. రాజస్థాన్లోని కిషన్గఢ్లో ఉన్న కొత్త రైల్వే స్టేషన్, ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా పట్టణం, ఖతార్లోని దోహాకు సంబంధించినవి ఉన్నాయి. గతంలో ప్రయోగించిన ఉపగ్రహాల మాదిరిగానే ఈ కార్టోశాట్-2 కూడా రిమోట్ సెన్సింగ్ విధానంలో నే పనిచేస్తుంది.
మరిన్ని ఛాయాచిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గగనతలం నుంచి అత్యధిక నాణ్యతతో కూడిన చిత్రాలను తీసేందుకు దీన్ని ఉపయోగిస్తారు. సైన్యం, వివిధ నిర్మాణాల ప్రణాళిక కోసం ఈ ఉపగ్రహాన్ని వినియోగించనున్నారు. కార్టోశాట్-2 పంపిన చిత్రాల్లో కొన్నింటిని ఎంపిక చేసి ఇస్రో తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. వాటిని మీరూ చూడొచ్చు.