29 మందితో వెళ్తున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం అదృశ్యం
చెన్నై: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏఎన్ 32 గల్లంతయింది. విమానంలో 29 మంది సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తోంది. చెన్నై నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళ్తుండగా హఠాత్తుగా శుక్రవారం ఉదయం ఏటీసీతో ఆ విమానానికి సంబంధాలు తెగిపోయాయి.
విమానం కోసే నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ విమానం చెన్నైలోని తంబరం నుంచి ఉదయం 8.30 గంటలకు గాల్లోకి ఎగిరింది. ఆ తర్వాత పదహారు నిమిషాలకు సంబంధాలు తెగిపోయాయి.
Comments
indian air force an 32 plane missing delhi chennai ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం మిస్సింగ్ ఢిల్లీ చెన్నై
English summary
Indian Air Force AN 32 plane carrying 29 people missing.