వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మసీదుపై ఐఎస్ఐఎస్ బాంబు దాడి: 21 మంది దుర్మరణం

|
Google Oneindia TeluguNews

సౌదీ అరేబియా: సౌదీ అరేబియాలో ఘోరం జరిగింది. మసీదులో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో బాంబు పేలుడు జరిగి 21 మంది దుర్మరణం చెందారు. ఈ దాడిలో అనేక మందికి తీవ్రగాయాలై ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.

సౌదీ అరేబియా పశ్చిమ ప్రావెన్స్ లోని షియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. సౌదీ అరేబియా పశ్చిమ ప్రావెన్స్ లోని ఖీదా గ్రామంలోని షియా మసీదులో ముస్లీం సోదరులు సామూహిక ప్రార్థనలు చెయ్యడానికి వెళ్లారు.

 ISIS

ఆ సమయంలో ఒక వ్యక్తి మసీదు లోపలికి వెళ్లాడు. తరువాత అతను ముందుగా తన శరీరానికి అమర్చుకున్న బాంబులు పేల్చేసుకున్నాడు. ఈ ఆత్మాహుతి దాడిలో 21 మంది మరణించారని సౌదీ అరేబియా ఆరోగ్య శాఖ మంత్రి అధికారికంగా వెల్లడించారు.

ఈ దాడిలో 80 మందికి పైగా గాయపడి వివిధ ఆసుపత్రులలో చికిత్స పోందుతున్నారని తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు (ఐఎస్ఐఎస్) ఈ దాడులు చేసింది తామే అని ప్రకటించుకున్నారు. షియాలే తమ టార్గెట్ అని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హెచ్చరించారు.

English summary
The Saudi health minister told state television that at least 21 people had been killed and more than 80 injured in the blast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X