217 మందిని ఉరి తీసిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు
బీరూట్: కరుడుకట్టిన ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నది. వారు చేస్తున్న దారుణాలు చూసి ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాము చేసిందే చట్టం, తాము చేసిందే న్యాయం అంటూ ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు చెలరేగిపోతున్నారు.
మే 16వ తేది నుండి ఆదివారం వరకు 9 రోజులలో 217 మందిని అంతం చేసిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఇంకా చాల మందిని అంతం చెయ్యాలని భావిస్తున్నారని సిరియాలోని బ్రిటన్ కు చెందిన ఒక మానవ హక్కుల సంస్థ ఆదివారం ప్రపంచం దృష్టికి తీసుకు వచ్చింది.
14 మంది పిల్లలతో సహ 67 మంది సామాన్య పౌరులు, 12 మంది మహిళలు, 150 మంది ప్రభుత్వ ఉద్యోగులను ఉరి తీసి వారి రాక్షసత్వాన్ని చూపించారు. సిరియాలోని పురాతన నగరం పాల్మిరాలో తీవ్రవాదులు ఈ దారుణానిని పూనుకున్నారు.
మహిళల మీద బహిరంగంగా సామూహిక అత్యాచారం చేసి, పిల్లలను పలు విధాలుగా చిత్రహింసలకు గురి చేసి బహిరంగ ప్రదేశాలలో వారిని ఉరి తీశారు. తమను ఎదిరించినా, తమకుసహకరించకపోయినా అందరికి ఇదే గతిపడుతుందని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు హెచ్చరిస్తున్నారు.