వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగం విజయవంతం (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేష్ సెంటర్ (షార్) నుంచి గురువారం ఉదయం 9:30 గంటలకు జీఎస్ఎల్‌వీ మార్క్ - 3 నింగిలోకి దూసుకెళ్లింది. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేందుకు 20 నిమిషాల సమయం పట్టింది. 3,745 కిలలో బరువు, 43.43 మీటర్ల ఎత్తు ఉన్న వ్యోమగాముల గదిని అంత్యరిక్షంలోకి తీసుకెళ్లింది జీఎస్ఎల్‌వీ మార్క్ - 3.

వ్యోమగాముల గదిని 126 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్లి అండమాన దీవుల సమీపంలోని సముద్రంలోకి దిగనుంది. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ భూమికి చేరుకోనుంది. అండమాన్‌కు సమీపంలోని సముద్రం వద్ద దీనిని తీసుకునేందుకు ఇస్రో ప్రత్యేక ఏర్పాటు చేసింది.

నింగిలోకి వెళ్లిన ఈ రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూడ మాడ్యూల్ (వ్యోమగాముల గది)ను అమర్చినట్లు ఇస్త్రో శాస్త్రవేత్తలు తెలిపారు. మొత్తం జీఎస్ఎల్‌వీ మార్క్ - 3 రాకెట్ బరువు 630.58 టన్నులు. ఇది కేవలం ప్రయోగాత్మకమైనదేనని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ ప్రయోగానికి రూ. 155 కోట్ల వ్యయం అయిందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంత్యరిక్షంలోకి పంపే క్రమంలోనే జీఎస్ఎల్‌వీ మార్క్ - 3ని ప్రయోగించింది. ఈ కార్యక్రమంలో ఇస్త్రో ఛైర్మన్ రాధాకృష్ణన్, షార్ డైరెక్టర్ ప్రసాద్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో హర్షం వ్యక్తం చేసింది.

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు

జీఎస్ఎల్‌వీ మార్క్ - 3 రాకెట్‌ను నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్రమోడీ అభినందనలు తెలిపారు. "జీఎస్ఎల్‌వీ మార్క్ - 3 రాకెట్ ప్రయోగం విజయవంతం అయినందుకు సంతోషం. ఈ విజయానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందలు" అంటూ ప్రధాని మోడీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

 నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి గురువారం ఉదయం 9:30 గంటలకు జీఎస్ఎల్వీ మార్క్-3 నింగిలోకి దూసుకెళ్లింది.

 నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

వ్యోమగాముగ గదిని 126 కిలోమీటర్ల ఎత్తులోకి తీసుకెళ్లి... అండమాన్ దీవుల్లో సమీపంలో సముద్రంలోకి దిగనుంది. పారాచూట్ల సాయంతో ఈ క్రూ మాడ్యూల్ తిరిగి భూమికి చేరుకోనుంది. అండమాన్ కు సమీపంలోని సముద్రం వద్ద దీనిని తీసుకునేందుకు ఇస్రో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

 నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

ఇది కేవలం ప్రయోగాత్మకమైనదేనని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రయోగానికి రూ.155 కోట్ల వ్యయం అయ్యిందని స్పష్టం చేశారు.

 నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

ఎల్‌వీఎం-3 రాకెట్ పయనంలో దాని చుట్టూ ఉండే సంక్లిష్ట వాతావరణాన్ని అధ్యయనం చేయడం

 నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

నింగిలోకి జీఎస్ఎల్వీ మార్క్-3: ప్రయోగం విజయవంతం

రాకెట్ నుంచి విడిపోయే వ్యవస్ధలన్నింటినీ ప్రయోగపూర్వకంగా పరిశీలించడం

English summary
India's space agency is all set for one of its most ambitious tests as it readies for the unique maiden flight today of its heaviest rocket to date - the 630-tonne, three-stage rocket Geo-Synchronous Satellite Launch Vehicle Mark III.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X