లేబర్ కోర్టును ఆశ్రయించిన టెక్ మహింద్ర టెక్కీలు !
టెక్ మహీంద్రలో ఉద్యోగాలు తొలగించడంతో టెక్కీలు లేబర్ కోర్టును ఆశ్రయించారు. టెక్ మహింద్ర ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో మహారాష్ట్ర కార్మిక శాఖ విఫలం కావడంతో ఐటీ ఉద్యోగుల.
బెంగళూరు: టెక్ మహీంద్రలో ఉద్యోగాలు తొలగించడంతో టెక్కీలు లేబర్ కోర్టును ఆశ్రయించారు. టెక్ మహింద్ర ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో మహారాష్ట్ర కార్మిక శాఖ విఫలం కావడంతో ఐటీ ఉద్యోగుల ఫోరం 11 వివాదాలకు సంబంధించి లేబర్ కోర్టును ఆశ్రయించారు.
బాధిత ఉద్యోగులు పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 2 ఏ కింద పిటిషన్లు దాఖలు చేశారని టెక్కీ ఉద్యోగుల ఫోరం కో-ఆర్దినేటర్ ఇలవరసన్ రాజా మీడియాకు చెప్పారు. సెక్షన్ 2 ఏ కింద ఏ ఉద్యోగినైనా సంస్థ తొలగించిన పక్షంలో దాన్ని పారిశ్రామిక వివాదంగా పరిగణిస్తారని ఇలవరసన్ రాజా వివరించారు.
ఈ విషయంపై టెక్ మహింద్ర స్పదించింది. న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. గతంలో ఓ ఉద్యోగిని బలవంతంగా కంపెనీ నుంచి తొలగించేలా టెక్ మహింద్ర హెచ్ఆర్ అధికారులు వ్యవహరించిన ఆడియో క్లిప్ లు బయటకు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న టెక్ మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్ర క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.