జయ ఓకే: ఎప్పుడు కోరితే అప్పుడు, అపోలో ప్రతాప్. సి. రెడ్డి
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలిత ఆరోగ్యంగా ఉన్నారని, ఆమె ఎప్పుడు కోరితే అప్పుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని అపోలో ఆసుపత్రి గ్రూప్స్ చైర్మన్ ప్రతాప్. సి. రెడ్డి అన్నారు.
శనివారం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. జయలలితను ఐసీయూ నుంచి త్వరలో స్పెషల్ రూంకు తరలిస్తామని ప్రతాప్. సి. రెడ్డి చెప్పారు.
జయలలితకు ఇన్ ఫెక్షన్ పూర్తిగా నయం అయ్యిందని, ఆమె స్వయంగా ఆహారం తీసుకుంటున్నారు. ముందులాగే అందరిని పలకరిస్తున్నారని అన్నారు. అయితే జయలలితను ఎప్పుడు డిశ్చార్జి చెయ్యాలో అనే విషయం ఆమె నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
తరువాత ఆ విషయం మాకు చెబితే అప్పుడు డిశ్చార్జి చేస్తామని అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి వివరించారు. జయలలిత ఆరోగ్యంపై అపోలో చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి రెండో సారి మీడియా ముందు క్లారిటీ ఇవ్వడంతో అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.