మంత్రి ముందే దండ వేసింది, కలాం వెళ్లిపోయారు
జార్ఖండ్: మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం మరణించిన తరువాత జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి నీరా యాదవ్ మీద ఫేస్ బుక్ లో పలువురు మండిపడుతున్నారు. అబ్దుల్ కలాం బ్రతికి ఉన్నట్లే నీరా యాదవ్ ఆయన ఫోటోకు పూలమాల వేసి, కుంకుమ పెట్టారు.
ఈ నెల 22వ తేదిన జార్ఖండ్ లోని ఒక విద్యాసంస్థలో ఎర్పాటు చేసిన కార్యాక్రమంలో నీరా యాదవ్ స్వయంగా కలాం ఫోటోకు పూల మాల వేసి, కుంకుమ పెట్టి పూజ చేశారు. తరువాత కలాం ఫోటో ముందు కొబ్బరి కాయ పెట్టారు. ఆ సందర్బంలో అక్కడ ఉన్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
తరువాత నేను ఏ తప్పు చెయ్యలేదని, కలాం గొప్ప వ్యక్తి అయినందు వలనే ఫోటోకు పూల మాల వేసి, కుంకుమ పెట్టానని ఆమె సమర్థించుకున్నారు. అయితే వారం రోజులు తిరగకుండానే కలాం మరణించడంతో అందరి దృష్టి నీరా యాదవ్ మీద పడింది.
సోషల్ మీడియాలో ఆమె మీద పలువురు మండిపడుతున్నారు. అమ్మా మహాతల్లి నీవు మంత్రివా, లేదా జోతిష్యురాలివా, ఇక ముందు నీవు ఎవరి ఫోటోకు దండ వెయ్యద్దు, కర్యాక్రమం జరిగే సమయంలో నీవు కోంచెం దూరంగా ఉండాలి అంటు కామెంట్లు చేస్తున్నారు.