విషాదం:పెళ్ళి చేసుకోలేదనే అక్కసుతో నవ వధువు గొంతు కోశాడు
తనను ప్రేమించలేదనే కోపంతోపాటు వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకొందనే అక్కసుతో నవ వధువు గొంతుకోశాడు ఓ కిరాతకుడు.అయితే ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకొంది.
ఘజియాబాద్:తనను ప్రేమించలేదనే కోపంతోపాటు వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకొందనే అక్కసుతో నవ వధువు గొంతుకోశాడు ఓ కిరాతకుడు.అయితే ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకొంది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్ లోని సాహిబాబాద్ టౌన్ షిప్ కు చెందిన 26 ఏళ్ళ యువతికి ఈ నెల 4వ, తేదిన సోనేపట్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో వివాహమైంది.
పెళ్ళి తర్వాత వచ్చిన తొలి హోలి పండుగను పుట్టింట్లో జరుపుకొనేందుకుగాను ఆ యువతి ఘజియాబాద్ కు వచ్చింది. అయితే ఆమెపై కోపంతో రగిలిపోతోన్న పొరుగింటి యువకుడు రాజీవ్ కశ్యప్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు.
ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గొంతు కోసి పరారయ్యాడు. ఈ హఠాత్ పరిణామంతో ఆ యువతి కేకలు వేసింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమె చావు బతుకుల మద్య ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కశ్యప్ తనను పెళ్ళి చేసుకోవాలని అనుకొన్నాడని, అయితే తాను వేరే వ్యక్తిని వివాహం చేసుకొన్నాననే కోపంతో తనను చంపాలనుకొన్నాడని ఆ యువతి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. అయితే వారిద్దరి మద్య ఉన్న సంబంధం ఏమిటనే విషయమై వివరాలు తెలియవని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలను చేపట్టారు పోలీసులు.