బంపర్ ఆఫర్: నిమిషానికి రూ.3లకే ఐఎస్డీ కాల్స్ ఆఫర్ ప్రకటించిన జియో
వరుస సంచలన ఆఫర్తో కస్టమర్లను తన వైపుకు తిప్పుకొంటున్న రిలయన్స్ జియో మరో ఆఫర్ ను ప్రకటించింది. నిమిసానికి రూ.3 చెల్లించి విదేశాలకు కాల్ చేసుకొనే వెసులుబాటను కల్పించింది.
న్యూఢిల్లీ:వరుస సంచలన ఆఫర్తో కస్టమర్లను తన వైపుకు తిప్పుకొంటున్న రిలయన్స్ జియో మరో ఆఫర్ ను ప్రకటించింది. నిమిసానికి రూ.3 చెల్లించి విదేశాలకు కాల్ చేసుకొనే వెసులుబాటను కల్పించింది.
అమెరికా, కెనడా, న్యూజిల్యాం్ , కెనడా, హాంకాంగ్,అస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, ఫ్రెంచ్ ,గయానా ఇటలీ, లగ్జెంబర్గ్ , మాల్టా, మంగోలియా, మొరాక్ , పోలాండ్ , పోర్చుగల్, రోమేనియా ,స్వీడన్ స్విస్, తైవాన్, రష్యా దేశాలకు కేవలం రూ.3 లకే నిమిషానికి ఛార్జీ చేయనున్నట్టు జియో ప్రకటించింది.
ఫ్రాన్స్, పాకిస్తాన్, ఇజ్రాయిల్, జపాన్ , అర్జెంటీనా, డెన్మార్క్, దక్షిణ కొరియా దేశాలకు కాల్ చేయాలంటే కేవలం రూ.4.8 చెల్లించాలి.అయితే ఈ ఛార్జీలు వర్తించాలంటే తొలుత రూ.501 రీ చార్జీ చేసుకోవాలని జియో ప్రకటించింది.
ధనాధన్ ఆఫర్ ను ఇటీవల ప్రకటించింది జియో. అయితే ధనా ధన్ ఆఫర్ లో రూ.303 తో రీచార్జీ చేసుకొంటే మూడు మాసాల పాటు రోజుకు 1 జీబీ డేటా తో పాటు వాయిస్ కాల్స్ ను ఉచితంగా ఇస్తోంది జియో.ఈ ఆఫర్ ప్రకటించడంతో ఇతర టెలికం కంపెనీలు కూడ తమ ఆఫర్లను ప్రకటించాయి.