చేతులు జోడించిన గౌతమి తండ్రి: మహేష్ అరెస్టు
బెంగళూరు: బెంగళూరు నగరంలోని కాడుగోడిలో ఉన్న ప్రగతి కాలేజ్ పీయుసీ విద్యార్థిని గౌతమి (18)ని హాస్టల్ లో కాల్చి చంపిన నిందితుడు మహేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గౌతమిని హత్య చేసిన నిందితుడు అక్కడి నుండి పరారైనాడు.
పోలీసు అధికారులు మూడు ప్రత్యేక బృందాలు ఎర్పాటు చేసి నిందితుడి కొసం గాలించారు. మహేష్ మొబైల్ నెంబరుతో పాటు అతని కుటుంబ సభ్యులు, స్నేహితుల మొబైల్ నెంబర్లు ట్రేస్ చేశారు. కేఆర్ పురం రైల్వే స్టేషన్ సమీపంలోని వైట్ ఫీల్డ్ మెయిన్ రోడ్డులోని బి. నారాయణ పురలోని అక్క ఇంటిలో మహేష్ తలదాచుకున్నాడని పోలీసులు గుర్తించారు.
బుధవారం మద్యాహ్నం మహేష్ అక్క ఇంటి మీద దాడి చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కాడుగోడి పోలీసులు మహేష్ ను విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న డీసీపీ రోహిణి కాడుగోడి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు.
చేతులు జోడించి చెబుతున్నా: రమేష్
ఐటి మీద ఆసక్తి ఎక్కువగా ఉన్న గౌతమి (18) సీఇటి పరిక్షలు వ్రాయడానికి సిద్దం అవుతున్నది. అందు వలన ఆమె కాలేజ్ హాస్టల్ లో ఉంటు చదువుకుంటున్నదని, ఆమె ఎవరి ప్రేమలో పడలేదని, దయచేసి తప్పుడు ప్రచారం చెయ్యరాదని గౌతమి తండ్రి. టి. రమేష్ మనవి చేశారు.