మోసం: కన్నడ సినీ నటి సుసైరాజ్ ఇల్లు సీజ్
అహ్మదాబాద్: కన్న సినీ నటి మరియా సుసైరాజ్ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు. మహరాష్ట్రలోని థానేలో ఇటీవల ఆమె నివసించిన ఇంటిని పోలీసులు శుక్రవారంనాడు స్వాధీనం చేసుకున్నారు. కన్నడ నటి మరియా సూసైరాజ్ను మోసం కేసులో గుజరాత్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మరియాకు చెందిన వడోదరా ట్రావెల్ ఏజెన్సీ ద్వారా హజ్యాత్రకు సంబంధించి సుమారు రూ.2.68 కోట్లు మోసానికి పాల్పడినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ట్రావెల్ ఏజెన్సీ ద్వారా హజ్యాత్రకు విమాన టిక్కెట్లు బుక్ చేసి అర్థాంతరంగా ఆ టిక్కెట్లు క్యాన్సల్ చేసి డబ్బు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆమెపై కేసు నమోదు కాగా, ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
దీంతో ఆమెపై నిఘా పెట్టిన పోలీసులు గుజరాత్లో ఉన్నట్టు పక్కా సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత గుజరాత్కు వెళ్లి స్థానిక పోలీసులు సహకారంతో ఆమెను అరెస్టు చేశారు.
కాగా, బుల్లితెర నిర్మాత నీరజ్ గ్రోవర్ హత్య కేసులో ఈమె జైలుశిక్షను కూడా అనుభవించారు. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేసిందన్న ఆభియోగాలు నిరూపితం కావడంతో మూడేళ్ళపాటు శిక్ష అనుభవించి, జైలునుంచి విడుదలైంది.