వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ. 6 కోట్ల కొత్త నోట్లు, 7 కిలోల బంగారు: తేలీదు, సీఎం

బెంగళూరులో ఐటీ అధికారుల దాడుల్లో చిక్కిన రూ. 4.70 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు మైసూరు, తమిళనాడులోని ఈరోడ్, బెంగళూరులోని బ్యాంకుల్లో డ్రా చేశారని వెలుగు చూసింది.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బెళగావి: బెంగళూరు నగరంలో ఆదాయ పన్ను (ఐటీ) అధికారుల దాడిలో చిక్కిన రూ. 4.70 కోట్ల కొత్త నోట్లతో సహ రూ. 6 కోట్లు, 7 కిలోల బంగారు బిస్కెట్లు, నగలు ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు ? ఎవరు తెచ్చారు ? ఎలా వచ్చింది ? అని అధికారులు ఆరా తీస్తున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఆప్తులైన కావేరీ జలమండలి ఎండీ చిక్కరాయప్ప, జాతీయ రహదారుల అభివృద్ది మండలి మేనేజింగ్ డైరెక్టర్ జయచంద్రలను శుక్రవారం వేకువ జామున వరకు ఐటీ అధికారులు విచారించారు.

<strong>సీఎం ఔట్ ? రూ. 6 కోట్ల కొత్త నోట్లు, 7 కిలోల బంగారం</strong>సీఎం ఔట్ ? రూ. 6 కోట్ల కొత్త నోట్లు, 7 కిలోల బంగారం

అయితే ఇంత పెద్ద మొత్తంలో నగదు ఏ బ్యాంకు నుంచి తీసుకు వచ్చారు అనే విషయం మాత్రం తెలియడం లేదు. అయితే విశ్వసననీయ సమాచారం మేరకు మైసూరు. తమిళనాడులోని ఈరోడ్ లో ఉన్న బ్యాంకుల నుంచి రూ. 2,000 నోట్లు డ్రా చేశారని వెలుగు చూసింది. బెంగళూరులోని ఓ బ్యాంకులో కూడా నగదు డ్రా చేశారని ఐటీ అధికారులు గుర్తించారు.

Karnataka Chief Minister Siddaramaiah, Income Tax raid case

మాకు సంబంధం లేదు: సీఎం సిద్దరామయ్య

బెళగావిలో జరుగుతున్న శీతలకాల సమావేశాలలో బీజేపీ నాయకులు బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల విషయంలో సమాధానం చెప్పాలని అధికార కాంగ్రెస్ పార్టీని గట్టిగా నిలదీశారు. ఈ దెబ్బతో కాంగ్రెస్ నాయకులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

ఈ విషయంపై సీఎం సిద్దరామయ్య స్పందిస్తూ కావేరీ జలమండలి ఎండీ చిక్కరాయప్ప, జాతీయ రహదారుల అభివృద్ది మండలి మేనేజింగ్ డైరెక్టర్ జయచంద్రలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

Karnataka Chief Minister Siddaramaiah, Income Tax raid case

<strong>ఐఏఎస్, బ్యాంక్ మేనేజర్ హడల్: ఐటీ దాడులు</strong>ఐఏఎస్, బ్యాంక్ మేనేజర్ హడల్: ఐటీ దాడులు

బీజేపీ కావాలనే ఆ ఇద్దరు అధికారులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి రాద్దాంతం చేస్తున్నదని ఆరోపించారు. అయితే ఐటీ అధికారుల దాడుల కేసు సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రతిపక్ష పార్టీ బీజేపీ పట్టుబడుతున్నది.

విషయం తెలుసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం బెంగళూరు చేరుకుని ఈ అక్రమ ఆస్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ అధికారులు అంటున్నారు.

English summary
IT raid on two individuals at Bengaluru has led to a major seizure of up to Rs 4.7 crore in cash which were largely new notes. The raids are said one is Cauvery Irrigation Corporation's MD chikkarayappa, another one person is Chief Officer of the National Highway Development Corporation chandrakanth Investigation continues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X