వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీకి నవాజ్ షరీఫ్ బంధువా ? సీఎం ప్రశ్న

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారత ప్రధాని నరేంద్ర మోడీకి పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏమైనా బంధువా ? అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నించారు. వారిద్దరి మద్య బంధుత్వం ఉందా అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు.

ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా నరేంద్ర మోడీ పాక్ వెళ్లి నవాజ్ షరీఫ్ ఇంటిలో జరిగిన శుభకార్యానికి వెళ్తే తప్పు లేదుకాని, రమ్య పాకిస్థాన్ ప్రజలు మంచి వాళ్లు అనడం తప్పా అని బీజేపీ నాయకులను చెప్పాలని డిమాండ్ చేశారు.

Karnataka Chief Minister Siddaramaiah on narendra modi

బీజేపీ అగ్రనేత ఎల్.కే. అద్వాని గతంలో జిన్నాని ప్రశంసించినప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు ఎందుకు విమర్శించలేదని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. ఇప్పుడు కావాలనే నటి, మాజీ సీఎం రమ్య విషయంలో బీజేపీ నాయకులు రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు.

రమ్య ఇప్పటికే తన మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్పారని, ఆ విషయంలో తాను జోక్యం చేసుకోనని చెప్పారు. రమ్యకు ఎవరి మద్దతు అవసరం లేదని, ఆమె చేసిన వ్యాఖ్యలకు ఆమె సమాధానం ఇచ్చే సత్తా ఉందని సీఎం సిద్దరామయ్య అన్నారు.

English summary
India Prime Minister Narendra Modi visited Pakistan Prime Minister Nawaz Sharief’s house. Are they relatives? Karnataka CM Siddaramaiah.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X