వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్మశానంలో ఓ రాత్రి గడపనున్న కర్ణాటక మంత్రి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గతంలో గ్రామాభివృద్ధిలో భాగంగా 'గ్రామాల్లో బస' అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్‌డి కుమారస్వామి. ఆ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు పలు గ్రామాల్లో రాత్రిపూట బస చేశారు. ఆ రోజుల్లో ఈ కార్యక్రమానికి బాగా పాపులారిటీ వచ్చింది.

ఇప్పుడు అదే కార్యక్రమానికి కాస్త అటు ఇటుగా ఆ రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి సతీశ్ జర్కిహోళి ఓ వినూత్న కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ప్రజల్లో ఉన్న మూడనమ్మకాలపై చైతన్యం తీసుకువచ్చేందుకు ఆయన శ్మశానంలో ఓ రాత్రి గడపాలని నిశ్చయించుకున్నారు.

Karnataka minister to spend a night in graveyard to create awareness on superstitions

డిసెంబర్ 6వ తేదీన భారత రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకుని, బెళగావి సిటీ కార్పోరేషన్‌లోని వైకుంఠధామ్ శ్మశాన వాటికలో నిద్రించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ కార్యక్రమం గురించి మంత్రి సతీశ్ జర్కిహోళి మాట్లాడుతూ తనకు ఈ ఆలోచన ఎప్పటి నుంచో ఉందని, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన ప్రచారం బెళగావి నుంచి మొదలవుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమానికి రాజకీయనేతలను ఎవరినీ పిలవడంలేదని తెలిపారు. ప్రజల్లో అవగాహన కలిగించేందుకు శ్మశానమే అత్యుత్తమ ప్రదేశమని అభిప్రాయపడ్డారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రముఖ అద్భుత వ్యక్తి హులికల్ నటరాజ్ పాల్గొనున్నారని చెప్పారు.

English summary
The programme has been planned on 6th December at the Vaikunth Dham, a burial cremation ground belongs to Belagavi City Corporation (BCC) in Sadashiv Nagar, on the occasion of death anniversary of Babasaheb Ambedkar, chief architect of Indian constitution.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X