మంచి విద్యార్ధిని కాను: మోడీ, మంత్రులకు విందు
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ సోమవారం నాడు ఢిల్లీలోని ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైద్య విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. తాను మంచి విద్యార్దిని కాదని, ఎప్పుడూ అవార్డు అందుకోలేదని అన్నారు.
ఎల్లప్పుడూ విద్యార్దిగా ఉంటూ కొత్త విషయాలు నేర్చుకోవాలని.. విద్యార్ది దశ అయిపోయిందని ఎప్పుడూ అనుకోవద్దని మోడీ విద్యార్దులకు సూచించారు. స్నాతకోత్సవానికి ఓ సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తిని అతిధిగా పిలవడం వల్ల పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన విద్యార్ధులు స్పూర్తి పొందుతారని తెలిపారు.
ఈ భావన విద్యార్ధుల్లో ఎంతో ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతుందని మోడీ అభిప్రాయపడ్డారు. వైద్యరంగంలో పరిశోధనలపై దృష్టిపెట్టాలని సలహా ఇచ్చారు.
మంత్రులకు ప్రధాని మోడీ విందు
ప్రధాని
మోడీ
సోమవారం
సాయంత్రం
తన
మంత్రి
వర్గంలోని
44
మంది
మంత్రులకు
విందు
ఇవ్వనున్నారు.
ఈ
రోజు
సాయంత్రం
కేబినేట్
సమావేశం
అనంతరం
ఈ
విందు
ఉంటుంది.
ప్రధాని
పదవి
చేపట్టిన
తర్వాత
తొలిసారిగా
మోడీ
ఇస్తున్న
ఈ
విందు
ప్రాధాన్యం
సంతరించుకుంది.
పలు కీలక అంశాలపై తన మంత్రులతో మనసు విప్పి చర్చించేందుకే మోడీ ఈ విందును ఏర్పాటు చేశారని తెలుస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ప్రభుత్వం అనుసరించాల్సిన విధివిధానాలపై భవిష్యత్ కార్యాచరణ గురించి ఈ విందులో మంత్రులతో మోడీ చర్చించనున్నారని సమాచారం.
మోడీ ప్రతిపాదనను తిరస్కరించిన గుజరాత్ సీఎం ఆనందీబెన్ పటేల్
గుజరాత్
ముఖ్యమంత్రి
ఆనందీబెన్
పటేల్
ప్రధాని
మోడీ
ప్రతిపాదనను
తిరస్కరించారు.
ఇంతకీ
ఏంటీ
ఆ
ప్రతిపాదన
అనుకుంటున్నారా..?
గుజరాత్
రాష్ట్ర
వ్యాపార
రాజధాని
అహ్మదాబాద్
మీదుగా
సర్ఖెజ్-గాంధీనగర్
ప్రధాన
రహదారిని
నిర్మించడం.
ఈ
ప్రతిపాదనను
ఆనంది
బెన్
ప్రభుత్వం
నిర్ద్వంద్వంగా
తిరస్కరించింది.
ఈ రహదారి అభివృద్ధికి తామే నిధులిస్తామని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించినా ఆనందిబెన్ పటేల్ నిర్మోహమాటంగా తిరస్కరించారు. అయితే, ఆనందిబెన్ పటేల్ తిరస్కరణ సరైందే అంటున్నారు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. జన సంచారం అత్యధికంగా ఉండే అహ్మదాబాద్ మార్కెట్ మీదుగా ప్రధాన రహదారిని ఎలా ఏర్పాటు చేస్తారని కేంద్రాన్ని ప్రశ్నిస్తూ, ఆనందిబెన్ పటేల్కు వారు మద్దతు పలికారు.