పరీక్షలో కాపీ కొడ్తూ పట్టబడ్డ ఐపీఎస్ అధికారి, ట్విస్ట్, ఇన్విజిలేటర్కే షాక్
కోచి: కేరళ రాష్ట్రంలో ఓ పోలీసు అధికారి పరీక్షల్లో కాపీ కొడుతూ పట్టుబడ్డ సంఘటన జరిగింది. అతను ఐజీ. ఒకరు సోమవారం ఎల్ఎల్ఎం ఫైనల్ పరీక్షలో అతను కాపీ కొడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. అతను త్రిస్సూర్ రేంజి ఐజీగా పని చేస్తున్నాడు.
అతని పేరు టీజే జోస్. కోచి శివారున కలమస్సెరిలోని సెయింట్ పాల్ కళాశాలలో క్రైమ్-2 పరీక్షకు హాజరయ్యారు. తాను తెచ్చుకున్న కొన్ని పేపర్ల నుంచి ఈయన దర్జాగా కాపీ కొడుతుండగా హాలులోని ఇన్విజిలేటర్లు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని, బయటికి పంపించేశారు. జోస్ను డిబార్ చేశారు.
ఈ విషయమై మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ చైర్మన్ దీనిపై మాట్లాడేందుకు నిరాకరించారు. అయితే, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ నుండి నివేదికను కోరినట్లు చెప్పారు.
ఈ వ్యవహారంపై దర్యాప్తునకు కేరళ సర్కారు ఆదేశించింది. నార్తర్న్ రీజియన్ ఏడీజీపీ శంకర్ రెడ్డి దీనిని విచారిస్తారని కేరళ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ట్విస్ట్ ఏమంటే, తాను పట్టుకున్నది ఐపీఎస్ ఆఫీసర్ అని సదరు ఇన్విజిలేటర్కు తెలియదని తెలుస్తోంది.