వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తుంది, మొదటి వైపై నగరంగా: మమతా
కోల్కత్తా: కోల్ కత్తా నగరం రెండు నెలల్లో వైఫై నగరంగా మారనుంది. 39వ అంతర్జాతీయ బుక్ ఫెయిర్లో పాల్గొన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కంపెనీ భాగస్వామ్యంతో ఫిబ్రవరి 5 నుంచి కోల్కతా పార్క్ స్ట్రీట్లో 4జీ వై పై సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ 4జీ వై పై సర్వీసును ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తుందని చెప్పారు. రిలయన్స్ జియో బిజినెస్ హెడ్ తరుణ్ ఝంఝంవాలా దేశంలో వైపై సౌకర్యం రానున్న తొలి మెట్రో సిటీ కోల్కత్తా అవుతుందన్నారు. 4జీ వై ఫై ఇంటర్నెట్ సర్వీసుని అందిస్తున్నారు.
దేశంలో ఇప్పటికే బెంగుళూరు నగరంలో కొన్ని చోట్ల వైఫై సేవలు అందిస్తుండగా, ముంబైలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణా రాష్ట్రంలో హైద్రాబాద్ నగరంలో కొన్ని చోట్ల ప్రభుత్వం వైఫై అందిస్తున్న విషయం తెలిసిందే.
Comments
English summary
Kolkata is going to be the first Wifi-enabled city of the country, Chief Minister Mamata Banerjee announced Tuesday.