ఉద్యోగం ఇస్తానని ఆశచూపి ఆరుమాసాల పాటు అత్యాచారం
ఉద్యోగం పేరుతో ఓ యువకుడు ఉజ్బెకిస్తాన్ కు చెందిన ఓ యువతిపై ఆరు మాసాలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు చివరకు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ:ఉద్యోగం పేరుతో ఓ యువకుడు ఉజ్బెకిస్తాన్ కు చెందిన ఓ యువతిపై ఆరు మాసాలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు చివరకు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు.
ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతానికి చెందిన సోను అలియాస్ సుమిత్ అనే వ్యక్తికి ఫేస్ బుక్ ద్వారా ఉజ్బెకిస్తాన్ యువతి పరిచయమైంది. గుర్గావ్ కు చెందిన ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు.
ఈ ఐటీ కంపెనీలో తాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నట్టు ఆయన యువతిని పరిచయం చేసుకొన్నాడు. ఓ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలకడంతో ఆమె భారత్ కు వచ్చింది.
ఆరు మాసాల క్రితం ఆమె ఢిల్లీకి చేరుకొంది. ఎయిర్ పోర్ట్ లో ఆమెను రిసీవ్ చేసుకొన్నాడు.సెక్యూరిటీ డిపాజిట్ కింద ఆమె నుండి పాస్ పోర్టు , డబ్బు తీసుకొన్నాడు. ఆమెను ఓ ప్రాంతంలో ఉంచాడు.
ఆరు మాసాల పాటు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.అయితే బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు.నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణచేస్తున్నారు.