హోటల్లో సెక్స్ రాకెట్ రట్టు, మోడల్ను రక్షించారు
మేనేజర్గా పని చేస్తున్న నిజాముద్దీన్కు ఉమేష్ అనే వ్యక్తి సహకరిస్తున్నాడు. అతను వివిధ నగరాల నుండి యువతులను తీసుకు వచ్చి సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. ఈ దాడిలో ముగ్గురు యువతులను వ్యభిచారకూపం నుండి కాపాడినట్లు పోలీసులు తెలిపారు. అందులో ఒకరు స్మాల్ టైమ్ మోడల్ కూడా ఉన్నారని తెలిపారు.
మహిళలపై పెరిగిన నేరాలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే నేరాల సంఖ్య 59 శాతం పెరిగిందని ఓ ఎన్జీవో సంస్థ వెల్లడించింది. కేవలం 8 శాతం నేరాల్లో మాత్రమే శిక్షలు పడ్డాయని ఆ సంస్థ తెలిపింది.
ముంబైలో నివసిస్తున్న వారిలో 32 శాతం మంది నగరంలో రక్షణ లేదని భావిస్తుండగా, 36 శాతం మంది ఒకచోటి నుంచి మరోచోటికి సురక్షితంగా వెళ్ళే పరిస్థితి లేదని అభిప్రాయపడుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే అత్యాచార కేసులు 47 శాతం, వేధింపు కేసులు 52 శాతం, చైన్ స్నాచింగ్ కేసులు 66 శాతం పెరిగాయి.