కొడుకు లేని వేళల్లో కోడలిపై వ్యక్తి రెండేళ్ల పాటు రేప్
రేవారి: హర్యానాలో దారుణమపై సంఘటన చోటు చేసుకుంది. కుమారుడు లేని సమయాలు చూసి ఓ వ్యక్తి రెండేళ్ల పాటు వరుసగా కోడలిపై అత్యాచారం చేశాడు. రేవారిలోని యాదవ్నగర్ కాలనీలో ఓ సంఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తన మామ రెండేళ్ల పాటు తనను బెదిరిస్తూ తనపై అత్యాచారం చేస్తూ వచ్చాడని 26 మహిళ ఆరోపించింది. తన భర్త లేని సమయం చూసి ఈ నెల 25వ తేదీన కూడా తనపై అతను అత్యాచారం చేశాడని ఆమె చెప్పింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నిందితుడు పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి వాంగ్మూలాన్ని పోలీసులు శనివారంనాడు స్థానిక కోర్టులో రికార్డు చేశారు. విషయాన్నంతా ఇటీవల తన భర్తకు చెప్పానని, దాంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడని ఆమె చెప్పింది.