వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టోల్ గేట్ వద్ద ట్రక్కు భీభత్సం, ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

జమ్మూ కాశ్మీర్ లోని నగ్రోటా టోల్ గేట్ వద్ద ట్రక్కు భీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో టోల్ గేట్ ఉద్యోగి సుర్జీత్ కుమార్ మరణించగా, మరో ఇధ్దరు గాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

జమ్ము:ఓ టోల్ గేట్ వద్ద ట్రక్కు భీభత్సం సృష్టించింది.ఈ ఘటనలో ఓ టోల్ గేట్ ఉద్యోగి సుర్జీత్ కుమార్ మరణించాడు.మరో ఇద్దరు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని నగ్రోటా టోల్ గేట్ వద్ద ఈ ఘటన చోటు చేసుకొంది.

రోజు వందలాది వాహనాలు జమ్ముకాశ్మీర్ లోని టోల్ గేట్ వద్ద జరిగిన ఈ ఘటనలో రెండు కార్లు ద్వంసమయ్యాయి. ఓ టోల్ గేట్ ఉద్యోగి ప్రాణాలను కోల్పోయాడు.

జమ్మూ కాశ్మీర్ లోని జాతీయ రహదారిపై ఉన్న టోల్ గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకొంది..సిసీ టీవి కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.

Man crushed to death at Nagrota Toll Plaza

టోల్ ఫీజు చెల్లించేందుకు రెండు కార్లు టోల్ గేట్ వద్ద ఆగి ఉన్నాయి. ఈ రెండు కార్ల యజమానులు టోల్ పీజు చెల్లిస్తున్నారు.మరో వైపు ఈ టోల్ ఫీజు చెల్లించే సమయంలోనే వెనుక నుండి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు భీభత్సం సృష్టించింది.

టోల్ పీజు చెల్లిస్తున్న రెండు కార్లను ఢీకొట్టుకొంటూ వేగంగా వెళ్ళింది.అదే సమయంలో అక్కడే ఉన్న టోల్ గేట్ ఉద్యోగి ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.
టోల్ గేట్ నుండి కొంత దూరం రెండు కార్లను ఈడ్చుకొంటూ వెళ్ళి ట్రక్కు ఆగిపోయింది. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

English summary
In a brutal road accident reported last evening at Ban toll plaza in Nagrota, Jammu, a man identified as Surjeet Kumar lost his life .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X