వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాగ్వాదం: ప్రియురాలిపై కాల్పులు, పరిస్థితి విషమం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తన ప్రియురాలితో గొడవపడిన ఓ యువకుడు ఆవేశానికి గురై ఆమెను పిస్టల్‌తో కాల్చేశాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని శ్రీనివాసపురి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్నిగుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం.. బాదితురాలు నేహా ముంబైలో మోడల్‌గా పని చేస్తోంది. అయితే ఆమె ఢిల్లీలోని ఆమె తల్లిదండ్రులతో నివాసం ఉంటోంది. ఆమె తన ప్రియుడు ప్రిన్స్‌తో కలిసి కొద్ది నెలలుగా సహజీవనం చేస్తోంది.

Man shoots girlfriend in Delhi's Srinivaspuri area

ఈ క్రమంలో నేహా, ప్రిన్స్‌కు మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రిన్స్ తన వద్ద ఉన్న పిస్టల్‌ను తీసి నేహాపై కాల్పులు జరిపాడు. ఆమె పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తర్వాత అక్కడ్నుంచి నిందితుడు పరారయ్యాడు.

తుపాకీ శబ్ధం విన్న నేహా కుటుంబసభ్యులు పరుగెత్తుకుంటూ వచ్చేసరికి.. రక్తపు మడుగులో నేహా పడివుండటాన్ని గమనించారు. వెంటనే ఆమెను ఏయిమ్స్‌ ట్రామా సెంటర్‌కి తరలించారు. కాగా, బాధితురాలు ప్రస్తుతం వాంగ్మూలం ఇచ్చే స్థితిలో లేదని పోలీసులు తెలిపారు. ఆమె పరిస్థితి కొంత విషమంగా ఉందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

English summary
A man allegedly shot at his female friend last night in south Delhi's Srinivaspuri area after an argument between them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X