వాగ్వాదం: ప్రియురాలిపై కాల్పులు, పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: తన ప్రియురాలితో గొడవపడిన ఓ యువకుడు ఆవేశానికి గురై ఆమెను పిస్టల్తో కాల్చేశాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని శ్రీనివాసపురి ప్రాంతంలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్నిగుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. బాదితురాలు నేహా ముంబైలో మోడల్గా పని చేస్తోంది. అయితే ఆమె ఢిల్లీలోని ఆమె తల్లిదండ్రులతో నివాసం ఉంటోంది. ఆమె తన ప్రియుడు ప్రిన్స్తో కలిసి కొద్ది నెలలుగా సహజీవనం చేస్తోంది.
ఈ క్రమంలో నేహా, ప్రిన్స్కు మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ప్రిన్స్ తన వద్ద ఉన్న పిస్టల్ను తీసి నేహాపై కాల్పులు జరిపాడు. ఆమె పొట్టలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. తర్వాత అక్కడ్నుంచి నిందితుడు పరారయ్యాడు.
తుపాకీ శబ్ధం విన్న నేహా కుటుంబసభ్యులు పరుగెత్తుకుంటూ వచ్చేసరికి.. రక్తపు మడుగులో నేహా పడివుండటాన్ని గమనించారు. వెంటనే ఆమెను ఏయిమ్స్ ట్రామా సెంటర్కి తరలించారు. కాగా, బాధితురాలు ప్రస్తుతం వాంగ్మూలం ఇచ్చే స్థితిలో లేదని పోలీసులు తెలిపారు. ఆమె పరిస్థితి కొంత విషమంగా ఉందని తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.