వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్: బీజేపీలో చేరిన ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గోవా, మణిపూర్లలో చిన్నపార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి.
ఇంఫాల్: కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. గోవా, మణిపూర్లలో చిన్నపార్టీల మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి.
ఇటీవలో గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యే చేరిన విషయం తెలిసిందే. తాజాగా మణిపూర్లోనూ అదే జరిగింది. మణిపూర్ ఎమ్మెల్యే జిన్సునౌ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో జిన్సునౌ కాషాయ కండువా కప్పుకున్నారు. మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఆధ్వర్యంలో ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సింగత్ నియోజకవర్గం నుంచి జిన్సునౌ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.
Comments
English summary
Manipur Congress MLA Ginsuanhau has joined the ruling Bharatiya Janata Party, giving a shot in the arm to the BJP-led coalition government in the state.
Story first published: Tuesday, April 18, 2017, 16:07 [IST]