మహిళా మావోయిస్టుల నగ్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో, ప్రతీకారంగానే దాడి
ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో 26 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపిన ఘటన ముమ్మాటికీ ప్రతీకార చర్యేనని మావోయిస్టు దండకార్య అధికార ప్రతినిధి వికల్ప్ చెప్పారు.
రాయ్ పూర్: ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో 26 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను చంపిన ఘటన ముమ్మాటికీ ప్రతీకార చర్యేనని మావోయిస్టు దండకార్య అధికార ప్రతినిధి వికల్ప్ చెప్పారు.
ఈ మేరకు ఆయన పేరుతో ఓ ఆడియో టేపు విడుదలైంది. భద్రతా బలగాలు తమపై దాడులు చేస్తూ తమను మట్టుబెడుతున్నాయని ఆడియో ద్వారా తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతోందని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో కేంద్ర బలగాల అరాచకత్వం కొనసాగుతోందన్నారు. ఆదివాసీలను చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మహిళా మావోయిస్టులను నగ్న చిత్రాలు తీసి వేధిస్తున్నారు
ఎన్ కౌంటర్ల సమయంలో పట్టుబడ్డ మహిళా మావోయిస్టులను అసభ్యంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారనంటూ వికల్ప్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ అరాచకాలకు వ్యతిరేకంగానే తాము దాడులకు పాల్పడుతున్నామన్నారు. ప్రభుత్వం ఇకనైనా అరాచకాలు ఆపకపోతే మరిన్ని దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు.