వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బద్ధ శత్రువులైన లాలూ, ములాయం బంధువులు కాబోతున్నారు...!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌లు త్వరలో బంధువులు కాబోతున్నారు. ములాయం సింగ్ యాదవ్ మనవడు తేజ్ ప్రతాప్, లాలూ ప్రసాద్ యాదవ్ చిన్న కూతరు రాజలక్ష్మికి వివాహం కుదిరింది.

డిసెంబర్‌లో ఎంగేజ్ మెంట్ చేసుకోనున్న వీరి పెళ్లిని ఫిబ్రవరిలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రెండు కుటుంబాలు ప్రణాళికలు చేస్తున్నాయి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తన తాత ములాయం సొంత నియోజకవర్గం మెయిన్ పురి నుంచి బరిలోకి దిగిన తేజ్ ప్రతాప్ పార్లమెంట్‌లో తొలిసారిగా అడుగుపెట్టారు.

Marriage may forge new Mulayam-Lalu alliance

ఇద్దరూ ఒకే సామాజికి వర్గానికి చెందినా... బద్ద శత్రువులుగానే కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలం రాజకీయ శత్రువులుగా కొనసాగిన వీరి మధ్య ఈ పెళ్లి ద్వారా మైత్రి చిగురించింది.
ఇప్పటికే బీహార్‌లో అధికార జనతాదళ్(యూ), మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సారధ్యంలో ఆర్‌జేడీ రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నిర్ణయించాయి.

English summary
Days after the announcement that Mulayam Singh Yadav's Samajwadi Party and Lalu Prasad's RJD may come together in a new incarnation of Janata Dal, it is learnt that the two Yadav pashas may end up in a closer clinch through matrimony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X