ఏడాదిగా మైనర్ బాలికపై 8 మంది టీచర్ల అత్యాచారం,వీడియో తీసి ఇలా..
పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లు కిరాతకంగా వ్యవహరించారు. మైనర్ బాలికపై ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడ్డారు.బాలిక అనారోగ్యానికి పాల్పడడంతో విషయం వెలుగుచూసింది.ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోట
జైపూర్: పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన టీచర్లు కిరాతకంగా వ్యవహరించారు. మైనర్ బాలికపై ఏడాదిపాటు అత్యాచారానికి పాల్పడ్డారు.బాలిక అనారోగ్యానికి పాల్పడడంతో విషయం వెలుగుచూసింది.ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.
రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఎనిమిది మంది ఉపాధ్యాయులు పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఏడాది కాలంగా టీచర్లు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన దృశ్యాలను వీడియో తీసి బాలిక తల్లిదండ్రులను బెదిరించారు.ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ హెచ్చరించారు.
ఈ బాలిక ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ కు గురైంది. దీంతో బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పంచాయితీ రాజ్ శాఖ మంత్రి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. బాలికకు మెరుగైన చికిత్స అందిస్తామని ప్రకటించారు.