రేప్ చేసి వీడియో తీశాడు: చూపించి మరోసారి, ఫ్రెండ్స్ బ్లాక్మెయిల్
జైపూర్: రాజస్థాన్లో పదిహేడేళ్ల బాలిక పైన అత్యాచారం జరిగింది. ఏడు నెలల క్రితం ఓ వ్యక్తి ఆమె పైన ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఉదంతాన్ని తన సెల్ ఫోన్లో వీడియో కూడా తీశాడు. దానిని చూపించి బెదిరిస్తూ బ్లాక్ మెయిల్కు పాల్పడ్డాడు.
మీ ఇంటి నుండి డబ్బులు తీసుకు రావాలని, లేదంటే దీనిని బయట పెడతామని అతనితో పాటు మరో ముగ్గురు అతని స్నేహితులు బెదిరించినట్లుగా శనివారం నాడు పోలీసులు చెప్పారు.
నిందితుడు తనను గత ఏడాది జూన్ నెలలో సంగనేర్ ప్రాంతానికి తీసుకు వెళ్లారని, అక్కడ మహేంద్ర అనే వ్యక్తి తన పైన అత్యాచారానికి పాల్పడ్డాడని, దానిని వీడియో తీశారని పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. అప్పటి నుండి అతను ఆ వీడియో చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.
మీ ఇంటి నుండి డబ్బులు తీసుకు వచ్చి ఇవ్వాలని, లేదంటే దానిని అందరికీ పంపిస్తానని బెదిరించేవాడు. అతనితో పాటు అతని స్నేహితులు రాహుల్, గుడ్డి, రాజేంద్రలు కూడా బ్లాక్ మెయిల్ చేశారని చెప్పారు.
గత ఏడాది జూన్ నుండి నవంబర్ నెల వరకు ఆమె నిందితులకు రెండు లక్షల ముప్పై వైల రూపాయల పైనే ఇచ్చారు. పాత వీడియోను చూపిస్తూ నిందితుడు మహేంద్ర ఆమె పైన మరోసారి కూడా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వీరి పైన పోలీసులు శనివారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.