దారుణం: వరుసకు చెల్లెలయ్యే యువతిపై గ్యాంగ్రేప్
గుర్దాస్పూర్: పంజాబ్ రాష్ట్రం గురుదాస్పూర్లోని బోజా గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 17ఏళ్ల యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు ఆమెకు వరుసకు సోదరులు కావడం మరో దారుణమైన విషయం.
లఖ్వీందర్ సింగ్ అనే వ్యక్తి ఈ యువతిని ఎనిమిదేళ్ల క్రితం దత్తత తీసుకున్నాడు. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో లఖ్వీందర్సింగ్ ఇద్దరు కొడుకులు ఉన్నారు. వీరిద్దరితో పాటు వారి స్నేహితులు మరో ఇద్దరు ఉన్నారు.
ఆమె గర్భవతి కావడంతో లఖ్వీందర్, అతడి భార్య రింకి బలవంతంగా ఆ యువతికి అబార్షన్ చేయించారు. బాధిత యువతి ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు లఖ్వీందర్, రింకి, వారి కొడుకులు దావీంద్ర, జుగరాయ్, వారి స్నేహితులు రవీంద్ర, మను పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.