మాజీ సీఎంపై మనీలాండరింగ్ కేసు: చిక్కుల్లో జాగ్వార్ హీరో ఫ్యామిలీ, మాజీ ప్రధానికి !
జాగ్వార్ సినిమా హీరో నిఖిల్ కుమార్ గౌడ తండ్రి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి మరోసారి చిక్కుల్లో పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఐటీ (ఆదాయపన్
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి మరోసారి చిక్కుల్లో పడ్డారు. మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ. కుమారస్వామి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు ఐటీ (ఆదాయపన్ను) శాఖ ఇన్వెస్టిగేషన్ వింగ్ లో బుధవారం ఫిర్యాదు దాఖలైంది.
మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామిపై వచ్చిన ఫిర్యాదును విచారణకు స్వీకరించామని ఆదాయపన్ను శాఖ ధ్రువీకరించింది. మాజీ సీఎం కుమారస్వామి, ఆయన తండ్రి, మాజీ ప్రధాని హెచ్ డీ. దేవేగౌడ కుటుంబ సభ్యులు మనీలాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో మాజీ సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవేగౌడ కుటుంబ సభ్యులు దేశంలో, విదాశాల్లో పెట్టుబడుల గురించి ఆదాయపన్ను శాఖ అధికారులు ఆరా తీసి ప్రశ్నించారని తెలిసింది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిపై ఇప్పటికే లోకాయుక్తలో ఓ కేసు నమోదు అయ్యింది.
కర్ణాటక లోకాయుక్త ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు మాజీ సీఎం కుమారస్వామిని విచారణ చేసి వివరాలు సేకరించారు. కుమారస్వామి కేసులో ఇటీవల మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సాక్షం చెప్పారు. కుమారస్వామి స్వయంగా తన కుమారుడు నిఖిల్ కుమార్ గౌడ హీరోగా కన్నడ, తెలుగు బాషాల్లో సుమారు రూ. 70 కోట్ల వ్యయంతో జాగ్వార్ అనే సినిమాను నిర్మించి విడుదల చేశారు.