ఆ కోతి రివేంజ్ తీర్చుకుంటోంది: ముగ్గురు రైలు డ్రైవర్లపై దాడి
పాట్నా: తన తోబుట్టువును చంపేశారనే కోపంతో ఓ కోతి ప్రతీకారం తీర్చుకుంటోంది. తన తోబుట్టువైన మరో కోతి రైలు కింద పడి చనిపోవడంతో.. ఆ కోతి రైలు డ్రైవర్లపై పగపట్టింది. దీంతో రైల్వే స్టేషన్కు వచ్చిన ప్రతీ డ్రైవరుపై ఆ కోతి దాడి చేస్తూ తన ప్రతీకారాన్ని తీర్చుకుంటోంది. ఈ విషయాలను రైల్వే అధికారులే చెప్పడం గమనార్హం.
వివరాల్లోకి వెళ్తే.. గత వారం బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా వాల్మికీ రైల్వే స్టేషన్ వద్ద ఓ కోతి గూడ్స్ రైలు కింద పడి మృతి చెందింది. ఇక అప్పటి నుంచి దాని తోబుట్టువు అయిన మరో కోతి రైలు డ్రైవర్లపై ప్రతీకారం పెంచుకుంది. దీంతో వరుసగా ముగ్గురు రైల్వే డ్రైవర్లపై కోతి దాడి చేసింది.
ఇద్దరు డ్రైవర్లను తోటి రైల్వే ఉద్యోగులు కోతి దాడి నుంచి రక్షించారు. మరో డ్రైవర్ రైలు క్యాబిన్లోనే ఉండి ప్రాణాలను కాపాడుకున్నాడు. మరో గూడ్స్ రైలు డ్రైవర్ పైనా దాడికి ప్రయత్నించింది. అతడ్ని కూడా రైల్వే సిబ్బంది కాపాడారు.
కాగా, ఈ ఘటనల నేపథ్యంలో వాల్మికీ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైళ్లు ఆపే ముందే డ్రైవర్లను ఇక్కడి రైల్వే సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు.