విదేశాల్లో భర్త ఉద్యోగం: ప్రియుడితో కలిసి పారిపోయిన భార్త, రెండేళ్ల పాప !
ఉద్యోగ రీత్యా భర్త విదేశాల్లో ఉన్న సమయంలో తన రెండేళ్ల పాపతో కలిసి మహిళ ప్రియుడితో పారిపోయిన ఘటన కర్ణాటకలోని పుత్తూరులో జరిగింది. బిడ్డతో సహ మాయం అయిన ఆమె కోసం పుత్తూరు నగర పోలీసులు గాలిస్తున్నారు.
బెంగళూరు: ఉద్యోగ రీత్యా భర్త విదేశాల్లో ఉన్న సమయంలో తన రెండేళ్ల పాపతో కలిసి మహిళ ప్రియుడితో పారిపోయిన ఘటన కర్ణాటకలోని పుత్తూరులో జరిగింది. బిడ్డతో సహ మాయం అయిన ఆమె కోసం పుత్తూరు నగర పోలీసులు గాలిస్తున్నారు.
పుత్తూరులోని పేట వీదికి చెందిన మహిళకు, మంగళూరుకు చెందిన వ్యక్తితో మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. ఉద్యోగ రీత్యా ఆమె భర్త విదేశాలకు వెళ్లారు. భర్త విదేశాల్లో ఉండటంతో తన రెండేళ్ల కుమారుడితో కలిసి ఆమె పుత్తూరులోని పుట్టింటిలో నివాసం ఉంటున్నది.
గత గురువారం ఈమె తన బిడ్డను తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తరువాత ఆమె తిరిగిరాలేదు. బంధువులు, భర్త ఇంటి దగ్గర ఆమె కోసం ఆరా తీసిన కుటుంబ సభ్యులు చివరికి ఆచూకి చిక్కకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భర్త విదేశాలకు వెళ్లిన తరువాత ఆమె మరో వ్యక్తితో ప్రేమలో పడిందని తెలిసింది. ప్రేమించిన వ్యక్తితో కలిసి బిడ్డను తీసుకుని ఆమె వెళ్లిపోయిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే ఆమె ఎక్కడ ఉంది అనే విషయంతెలుసుకోవడానికి పోలీసులు గాలిస్తున్నారు.